
నవతెలంగాణ-కంఠేశ్వర్ : బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి శుక్రవారం పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్, ఈ సమాజానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించడంలో కీలక భూమిక పోషించిన జ్ఞాని మరియు న్యాయవాది వారి యొక్క ఆశా సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వసంతరావు పిల్లి. శ్రీకాంత్, పులి జైపాల్, బిట్ల రవి, తుకారం, గంగారం, గంగా ప్రసాద్,చుక్కబొట్లరాజు ఏరేటి నారాయణ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.