– తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం
నవతెలంగాణ-సూర్యాపేట
నిరంకుశ అప్రజాస్వామిక అవినీతి సీఎం కేసీఆర్ను గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక గాంధీపార్క్లో జరిగిన తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్లీనరీలో ప్రతినిధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరకపోగా అన్ని రంగాల్లో తెలంగాణ విలువలు దిగజారిపోతున్నాయని విమర్శించారు. ఇలాంటి నియంతృత్వ ముఖ్యమంత్రిని గద్దె దింపడం కోసం సామాజిక ప్రజా స్వామికి తెలంగాణ నిర్మాణం కోసం జన సమితి ఎన్నికల్లో రంగం సిద్ధం చేస్తుందన్నారు.కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్ను ఎదుర్కొనే స్థితిలో లేవన్నారు.బీజేపీనేమో కేసీఆర్ పట్ల రాజకీయస్వార్థంతో కూడుకున్న ఉదారవైఖరితో వ్యవహరిస్తుందని తెలిపారు.కాంగ్రెస్ ఏమో కేసీఆర్ను ఎదుర్కొనేందుకు వ్యూహం రూపొందించుకోవడంలో విఫలమవుతుందని ఆరోపించారు. సామాజిక ప్రజాస్వామికశక్తులను పౌర సమాజాలతో సరికొత్త అలయన్స్ రూపొందించి కేసీఆర్ను ఓడిస్తామని తెలిపారు.కొన్ని పత్రికలలో కావాలని జన సమితి పార్టీ మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఏదో పార్టీలో విలీనం కాబోతుందని రాస్తున్నారని, ఇది ప్రజలను పక్కదో పట్టియడమేనన్నారు.తెలంగాణ జన సమితి కచ్ఛితంగా స్వతంత్ర ఉనికితో నిలబడి కలబడుతుందన్నారు. తెలంగాణ జనసమితి కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేయాలని కోరారు.పార్టీ నిర్ణయించిన సీట్లలో అభ్యర్థుల గెలుపు కోసం పోరాడాలని పిలపునిచ్చారు. రాజకీయాలను వ్యాపారంచేసి ఆర్థిక ,రాజకీయాన్ని కలగలుపు చేసుకున్న కేసీఆర్ దుష్ట పాలనను అంతమోంది ంచాలని పేర్కొన్నారు.ప్లీనరీలో పలుఅంశాలపై పార్టీ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానాలను ప్రతినిధులు ఆమోదించారు.తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ ప్రవేశపెట్టిన రాజకీయ తీర్మానాన్ని ప్రతినిధులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు.అనంతరం పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సత్యనారాయణ ఎన్నికల కోసం అధ్యక్ష ఎన్నిక కోసం నామినేషన్ స్వీకరించగా కోదండరాముడు బలపరుస్తూ మాత్రమే నామినేషన్లు ఫైల్ చేసినందున కోదండరాముని మరో దఫా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ప్రకటించారు.అంతకుముందు జనసమితి కార్యకర్తలు పట్టణంలో భారీ బైక్ర్యాలీ నిర్వహించారు.ఈ ప్లీనరీలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు పీఎల్ విశ్వేశ్వరరావు, ప్రధానకార్యదర్శులు అంబటి శ్రీనివాస్, గోపగాని శంకర్రావు, ముఖ్యరాజు, ఆశప్ప, నిజ్జన రమేష్, యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సలీం పాషా, విద్యార్థి సమితి నాయకులు అరుణ్, సర్దార్ వినోద్, నారబోయినకిరణ్, గట్ల రమాశంకర్,మల్లయ్యయాదవ్, బొమ్మగాని వినరుగౌడ్, కంబాలపల్లి శ్రీనివాస్, యాకోబు రెడ్డి ,వలి, వాళ్ళకి గోవర్ధన్, కొల్లు కృష్ణారెడ్డి ,బచ్చలకూరిగోపి, సూర్యనారాయణ, బంధన్నాయక్ తదితరులు పాల్గొన్నారు.