శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ, ఆంధ్రప్రదేశ్ కి LG సెల్ఫ్–లాండ్రీ సర్వీస్

నవతెలంగాణ-హైదరాబాద్ : విద్యార్థి జీవితాన్ని మెరుగుపరిచే తమ మిషన్ కొనసాగింపులో, భారతదేశపు ప్రీమియర్ వినియోగదారు డ్యూరబుల్ బ్రాండ్ LG ఎలక్ట్రోనిక్స్, తమ వినూత్నమైన సెల్ఫ్-లాండ్రీ సర్వీస్ ను శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ కోసం విడుదల చేసింది. దీనిలో భాగంగా 5 మెషీన్లు ఇన్ స్టాల్ చేసింది. గల్ గోటియాస్ కాలేజీ, గల్ గోటియాస్ యూనివర్శిటీ, BITSOM, NIT గోవా మొదలైన ప్రాంతాల్లో విజయవంతంగా చేసిన పరిచయంపై ఈ విస్తరణను కొనసాగించింది. కాలేజీలో కొత్త సెల్ఫ్-లాండ్రీ సదుపాయం సుమారు 5300 మంది విద్యార్థులకు సేవలు అందిస్తుంది, ‘లాండ్రీ క్రూ’ యాప్ ద్వారా ఎల్జీ కమర్షియల్ వాషింగ్ మెషీన్స్ ను ఉపయోగించే సౌకర్యాన్ని అందిస్తుంది. మెషీన్ రిజర్వేషన్స్, ఆపరేషన్స్, మరియు స్వయంచాలిత చెల్లింపులను ప్రారంభించడం ద్వారా ఈ యాప్ లాండ్రీ ప్రక్రియను అమలులోకి తెస్తుంది, విద్యార్థులకు ఇబ్బందులు లేని అనుభవం కలగచేస్తుంది. “విద్యార్థులకు ఆచరణసాధ్యమైన మరియు వినూత్నమైన పరిష్కారాలను తీసుకురావడం, తమ సమయాన్ని మెరుగ్గా నిర్వహించడంలో వారికి సహాయపడటం మా లక్ష్యం,” అని శ్రీ. హోంగ్ జు జియాన్, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా ఎండి అన్నారు. “ఈ సేవతో, మేము విద్యార్థుల కోసం మరింత సౌకర్యవంతమైన మరియు సమర్థవంతమైన వాతావరణాన్ని సృష్టించే లక్ష్యాన్ని కలిగి ఉన్నాము. ఆధునిక టెక్నాలజీకి మరియు మా వినియోగదారుల కోసం రోజూవారీ జీవితాన్ని మెరుగుపరచడానికి మేము కట్టుబడ్డాము. మా ఇటీవలి ‘లైఫ్ ఈజ్ గుడ్ విత్ ఆప్టిమిజమ్’ కాంపైన్ జెన్ Zతో మరింత కలుపుతుంది, మన దిగ్గజ ‘లైఫ్ ఈజ్ గుడ్ ‘ సిద్ధాంతంపై విస్తరిస్తోంది.” సంస్థఖు తమ సెల్ఫ్-లాండ్రీ సేవలను విస్తరించడం ద్వారా, LG ఎలక్ట్రానిక్స్ విద్యా రంగం కమ్యూనిటీకి తమ మద్దతును అంకితం చేయడం ప్రదర్శించింది. ఈ చొరవ రోజూవారీ జీవితంలోకి వినూత్నమైన టెక్నాలజీని సమీకృతం చేసి, విద్యార్థుల రోజూవారీ జీవితంలో సహాయపడటానికి మరియు వారి పూర్తి క్యాంపస్ అనుభవాన్ని మెరుగుపరచడానికి చేసిన విస్తృతమైన వ్యూహంలో ఒక భాగం.