– రూ. 2000 రూపాయల జరిమానా: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
నవతెలంగాణ – సిరిసిల్ల
హత్య కేసులో నిందుతునికి జీవిత ఖైదు, రూ.2000/- రూపాయల జరిమాన విధిస్తూ సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్. ప్రేమలత శుక్రవారం తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామానికి చెందిన ఇలవేణి స్వప్నకి తన మరిది అయిన నవీన్ ల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి ఈ క్రమంలో 2020 సంవత్సరం సెప్టెంబర్ 07 వ తేదీన స్వప్న మరియు నవీన్ ల మధ్య గొడవ జరుగగా సప్న తండ్రి గీస రాములు గొడవను ఆపే ప్రయత్నం చేయగా కోపోద్రిక్తుడైన నవీన్ రాములు తలపైన పారతో కొట్టాగా తీవ్రంగా గాయపడిన రాముల్ని వెంటనే దవాఖానికి తరలించగా మరునాడు చికిత్స పొందుతూ మరణించాడు.ఈ ఘటనపై తంగళ్ళపల్లి పోలీసులు కేసు నమోదు చేసి నవీన్ ని రిమాండ్ కు తరలించారు.అప్పటి సీ.ఐ సర్వర్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నర్సింగరావు వాదించాగా కోర్టు మానిటరింగ్ ఎస్.ఐ రవీందర్ నాయుడు ఆధ్వర్యంలో కానిస్టేబుల్లు నరేందర్, నవీన్ లు కోర్టులో 13 మంది సాక్షులను ప్రవేశపెట్టగా పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు,2000 రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ తెలిపారు.