ఈత వనాల పెంపకంతో జీవానోపాధి మెరుగు..

నవతెలంగాణ-బెజ్జంకి
ఈత వనాల పెంపకంతో గ్రామంలోని గౌడ కులస్తుల జీవానోపాధి మెరుగుపడుతుందని హుస్నాబాద్ డివిజన్ అబ్కారీ శాఖ సీఐ దామోదర్ అన్నారు.మంగళవారం మండల పరిదిలోని దాచారం గ్రామంలో సర్పంచ్ పెంటమీదీ శ్రీనివాస్,వార్డ్ సభ్యులు,గౌడ కులస్తులతో కలిసి సీఐ దామోదర్ ఈత మొక్కలు నాటారు.గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు,గౌడ కులస్తులు పరస్పర సహకారంతో నాటిన ఈత మొక్కలను సంరక్షించాలని సీఐ సూచించారు.ఈత మొక్కల పెంపకానికి కృషిచేసిన సర్పంచ్ శ్రీనివాస్ ను సీఐ అభినందించారు.అబ్కారీ శాఖాధికారులు సాయి క్రిష్ణ,పంచాయతీ కార్యదర్శి సురేశ్,గౌడ కులస్తులు పాల్గొన్నారు.