రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఋణ మాఫీ పూర్తి చేయాలి

Loan waiver should be completed without any difficulties for the farmers– రైతు ముఖంలో సంతోషం కనిపించెలా బ్యాంకు మేనేజర్లు సెవలందించాలి..
– రైతులకు ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ డస్క్ ద్వార పరిష్కారానికి చర్యలు
– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
రైతులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఋణ మాఫీ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తెజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం  కలెక్టర్ కార్యాలయం  కలెక్టర్ సమావేశ మందిరంలో రైతు రుణమాఫీ ప్రక్రియపై అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంకర్లతో   సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 56,217 మంది రైతులకు రూ॥282,98 కోట్లు రైతు రుణమాఫీ జరుగుతుందని తెలిపారు.  ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని ఆయన తెలిపారు. మొదటి విడత రుణమాఫీలో భాగంగా ఒక లక్ష రూపాయలు లోపు బకాయిలు ఉన్న రైతుల  ఖాతాలలో డబ్బు జమ అవుతుందని తెలిపారు. బ్యాంకర్లు రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా రుణమాఫీ ప్రక్రియ కొనసాగించాలని అన్నారు.రైతు ముఖంలో సంతోషం కనిపించెలా బ్యాంకు మేనేజర్లు సెవలందించాలి.  రైతులకు రుణమాఫీ ఏ ఖాతాలో  జమ చేసామే  బ్యాంకర్లు రైతులకు తెలపాన్నారు. రైతు పట్టాదారు పాసుపుస్తకాలు, ఆధార్ నంబర్, బ్యాంక్ వివరాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు.
  రైతులకు  ఇచ్చిన రుణ వివరాలు, రుణమాఫీ జరిగిన తరవాత మిగిలిన రైతుల వివరాలు కూడా సేకరించాలని, ఋణ మాఫీ వచ్చిన వారి వివరాలు పక్కగా ఉండాలన్నారు.భ్యాంకులలో ప్రత్యేక సమయం, ప్రత్యేక కౌంటర్ లను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. రైతు ఋణ మాఫీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు,  బ్యాంకర్లు పాల్గొనాలని సూచించారు.బకాయిలు ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండులక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని,  రైతులు రుణమాఫీకి దరఖాస్తు చేసేప్పుడు తప్పకుండా పట్టాదారు పాసుపుస్తకాలు, బ్యాంక్ పాసు పుస్తకాల జిరాక్స్ కాపీలను జతపరచాలని ఆయన  పేర్కొన్నారు. 2023 డిసెంబర్ 09 వ తేది వరకు బ్యాంకుల్లో పంట ఋణాలు తీసుకుని ఇప్పటి వరకు తిరిగి చెల్లించని రైతులకు ఋణ మాఫీ ఉంటుందని తెలిపారు.గ్రామ, మండల, జిల్లా స్థాయి లో ఋణ మాఫీకి సంబంధించి అర్హుల యొక్క జాభితా వ్యవసాయ శాఖ ద్వారా బ్యాంకులకు తెలియపరచడం జరుగుతుందని అన్నారు. రుణమాఫిలో  సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు ,రైతులకు ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ డస్క్ ద్వార పరిష్కారానికి చర్యలు ఏర్పాటు చేయడం జరిగిందని,  రైతులకు ఇబ్బందులు తలెత్తితే గ్రీవెన్స్ పోర్టల్ లో సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో  జిల్లా వ్యవసాయ అధికారి జి.G.శ్రీధర్ రేడ్డి, లీడ్ బ్యాంక్ అధికారి భాపుజి,వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ బ్రాంచి మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు.