రూ. 2.50 లక్షల ఎల్ఓసి అందజేత

 – మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ  – మల్హర్ రావు
మండలంలోని కొండంపేట  గ్రామానికి చెందిన తుంగెడ ప్రకాష్ రావు ఇటీవల అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చెరింది. వైద్య ఖర్చుల కోసం సహాయ నిమిత్తం ఆమె కుటుంబ సభ్యులు రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబును ఆశ్రయించారు. ఇందుకు మంత్రి దుద్దిళ్ల రూ.2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసిని  మంజూరు చేయించారు. శుక్రవారం ఆసుపత్రి సహాయకులు బాధిత కుటుంబానికి ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు. ఇందుకు మంత్రికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.