
నవతెలంగాణ- డిచ్ పల్లి: కాంగ్రెస్ పార్టీలో రోజు రోజుకు భారీ సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు చేరుతున్నారని నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అన్నారు. ఇందల్ వాయి మండలంలోని రూప్ల నాయక్ తండా గ్రామ వాసి ఇందల్ వాయి సహకార సొసైటీ డైరెక్టర్ భధవత్ సుధాకర్ నాయక్, రూప్ల నాయక్ తండా గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు బాధావత్ వసంతరావు, భధవత్ గబ్బర్ సింగ్, భగవత్ తిరుపతి, భగవత్ జగన్ఎమ్మెల్యే అభ్యర్థి భూపతిరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో శుక్రవారం చేరారు. ఈ సందర్భంగా భూపతిరెడ్డి మాట్లాడుతూ చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందరు కలిసి కట్టుగా పనిచేసి గెలుపె ద్యేయంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇందల్ వాయి మండల పార్టీ అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి తో పాటు తదితరులు ఉన్నారు.