ఝాన్సీ, ఘాజియాబాద్, రాయ్పూర్, భరూచ్, కడపలో కొత్తగా 5 డీలర్షిప్లు ప్రారంభం
జూలైలో మహీంద్రా ఈ కింద పేర్కొన్న నగరాల్లో 5 కొత్త డీలర్షిప్లను ప్రారంభించింది. అవేమిటంటే:
¨ 35,000 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 6 ‘వాహన సర్వీస్ బే’లతో ఉత్తర్ప్రదేశ్లోని ఝాన్సీలో వషు రాజ్ ఆటోమొబైల్స్. ¨ 34,000 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 7 ‘వాహన సర్వీస్ బే’లతో ఉత్తర్ప్రదేశ్లోని ఘాజియాబాద్లో అగర్వాల్ ఎలీట్ మోటర్స్. ¨ 27,000 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 10 ‘వాహన సర్వీస్ బే’లతో చత్తీస్గడ్లోని రాయ్పూర్లో బత్వాల్ సర్వీసెస్. ¨ 51,000 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 6 ‘వాహన సర్వీస్ బే’లతో గుజరాత్లోని భరూచ్లో కే పీ ట్రక్కింగ్. ¨ 86,000 చ.అ. విస్తీర్ణంలో, మొత్తం 8 ‘వాహన సర్వీస్ బే’లతో ఆంధ్రప్రదేశ్లోని కడపలో నవత ఆటోమోటివ్స్. ¨ ఈ 5 కొత్త డీలర్షిప్లతో కస్టమర్కేర్కు సంబంధించిన వర్క్షాప్లలో మొత్తం 2.5 లక్షల చ.అ. ఇన్ఫ్రా మరియు 37 బేలు జతవుతాయి. ¨ దీనితో మహీంద్రా ట్రక్స్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీడీ) నెట్వర్క్లో 3S డీలర్షిప్లు 85కి, ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లు 174కి, మహీంద్రా కస్టమర్ కేర్ సెంటర్స్ 72కి, రోడ్సైడ్ అసిస్టెన్స్ సర్వీస్ పాయింట్స్ 2,900కి పెరిగాయి. భారత్వ్యాప్తంగా కీలక ట్రక్కింగ్ రూట్లలో స్పేర్స్ నెట్వర్క్ను మెరుగుపర్చేందుకు ఉద్దేశించిన 1,600 రిటైల్ అవుట్లెట్లు, వ్యూహాత్మక ప్రదేశాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 22 MParts ప్లాజాలు వీటికి అదనం. ¨ HCVలు, ICVలు, LCVలు మరియు బస్సులు వంటి మొత్తం ఉత్పత్తుల శ్రేణికి సంబంధించి సేల్స్, స్పేర్స్, మరియు సర్వీస్ మొదలైనవి అందించేందుకు ఈ కొత్త డీలర్షిప్లు సర్వసన్నద్ధంగా ఏర్పాటయ్యాయి.
|
పుణె: సీఏజీఆర్ ప్రాతిపదికన 2024 ఆర్థిక సంవత్సరంలో 46 శాతం వ్యాపార పరిమాణం పెరుగుదలతో నాలుగేళ్ల పటిష్ట వృద్ధి సాధించిన మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ (ఎంటీబీడీ) జూలై నెలలో భారత్లో నాలుగు రాష్ట్రాల్లో కొత్తగా అయిదు అధునాతన డీలర్షిప్లను ప్రారంభించింది. వీటిలో రోజుకు 75 పైగా వాహనాలకు సర్వీసులు అందించేలా 37 సర్వీస్ బేలు ఉన్నాయి. అలాగే ఇవి డ్రైవర్ లాడ్జింగ్, 24 – గంటల బ్రేక్డౌన్ అసిస్టెన్స్, యాడ్బ్లూ మొదలైనవి కూడా అందించగలవు.
“భారతీయ సీవీ మార్కెట్లో ఎంటీబీడీకి పటిష్టమైన కార్యకలాపాలు ఉన్నాయి. సంస్థ ఇప్పటికే పలు రంగాలు, మార్కెట్లలో 3వ స్థానంలో ఉంది. మా నెట్వర్క్కు కొత్తగా ఈ 5 డీలర్షిప్లు తోడు కావడమనేది మా నెట్వర్క్ను మరింత పెంచగలదని, మా కస్టమర్ల వాహనాల సర్వీసింగ్కు, వారు తమ ఫ్లీట్లను మరింత సమర్ధంగా పనిచేయడంలో తోడ్పాటు అందించేందుకు ఉపయోగపడగలవని విశ్వసిస్తున్నాం. రాబోయే రోజుల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంపై మరింత ఉత్సాహంగా ఉన్నాం. మా విలువైన కస్టమర్లకు వినూత్నమైన, సమర్ధమంతమైన రవాణా సొల్యూషన్స్ను అందించడంపై మరింతగా దృష్టి పెడుతున్నాం” అని మహీంద్రా & మహీంద్రా బిజినెస్ హెడ్ (కమర్షియల్ వెహికల్స్) జలజ్ గుప్తా తెలిపారు.
బీఎస్6 ఓబీడీ II శ్రేణి ట్రక్కులకు సంబంధించి రవాణాదారుల లాభదాయకతను మరింత పెంచేందుకు తోడ్పడే హామీనిచ్చే “జ్యాదా మైలేజ్ నహీ తో ట్రక్ వాపస్” పేరిట కొత్త మైలేజ్ గ్యారంటీని ఆవిష్కరించిన సందర్భంగా తమ వాహనాల అత్యుత్తమ సాంకేతిక సామర్ధ్యాలను గుప్తా వివరించారు. పటిష్టమైన డీలర్ భాగస్వాములకు తోడు అధునాతన 3S యూనిట్లు, కస్టమర్ సర్వీస్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పేందుకు, ఎంటీబీ వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు తోడ్పడగలవని ఆయన తెలిపారు.
మహీంద్రా బ్లేజో ఎక్స్, ఫ్యూరియో, ఆప్టిమో, జేయో సీవీ ట్రక్కుల శ్రేణి మాత్రమే భారత్లో తమ తమ విభాగాల్లో అత్యుత్తమంగా ఇంధనం ఆదా చేయడంతో పాటు డబుల్ సర్వీస్ గ్యారంటీలను అందిస్తున్నాయి. బ్రేక్డౌన్ అయిన 48 గంటల్లోగా ట్రక్కును తిరిగి రహదారిపైకి తెచ్చేలా గ్యారంటీ అప్టైమ్ సర్వీసును ఎంటీబీడీ అందిస్తోంది. అలా జరగని పక్షంలో కస్టమరుకు కంపెనీ రోజుకు రూ. 1,000 చొప్పున చెల్లిస్తుంది. అంతే గాకుండా, డీలర్ వర్క్షాప్లో వాహన టర్నెరౌండ్ సమయం కచ్చితంగా 36 గంటల్లోపే ఉంటుంది. లేని పక్షంలో కంపెనీ రోజుకు రూ. 3,000 చెల్లిస్తుంది. నిరంతరం ఉత్పత్తుల్లో వినూత్నతను పాటించడం, కస్టమరుకు అత్యంత ప్రాధాన్యమివ్వడంపై ప్రధానంగా దృష్టి పెడుతుండటమనేది ఎంటీబీడీ ఇచ్చే హామీలను అమలు చేయడంలో గణనీయంగా తోడ్పడుతున్నాయి.