– బడ్జెట్ సవరించి 30 శాతం నిధులు కేటాయించాలి..
– పీ డి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు పి. మహేష్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
విద్యారంగానికి 7.31 శాతం నిధులు కేటాయించడం అన్యాయం అని పిడిఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు పి. మహేష్ అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ చండ్ర పుల్లా రెడ్డి విజ్ఞాన కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాటలాడతూ విద్య రంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని నిరసిస్తూ నేడు అసెంబ్లీ ముట్టడి స్తున్నామని తెలిపారు.అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి తీవ్ర కోతలను మిగిల్చారని ఆరోపించారు.ఈ కేటాయింపులు విద్యారంగా అభివృద్ధికి ఏమాత్రం సరిపోవని మండిపడ్డారు.సంక్షోభంలో ఉన్న విద్యారంగాన్ని ప్రక్షాళన చేసి అభివృద్ధి చేయాలంటే కనీసం రాష్ట్ర బడ్జెట్లో 30 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాలన్నారు.అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించేలా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించి కాంగ్రెస్ పార్టీ తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.గురుకుల ఉపాధ్యాయ అర్హత సాధించి, గురుకుల బోర్డు అవకతవకల వల్ల నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీస్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయించేలా ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని,లేనిపక్షంలో విద్యార్థి నిరుద్యోగులను కలుపుకొని పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్ యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్, పి వై ఎల్ జిల్లా అధ్యక్షులు నల్గొండ నాగయ్య, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు పుల్లూరి సింహద్రి, జిల్లా కోశాధికారి బండి రవి, డివిజన్ ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్, వీరబోయిన లింగయ్య, బాణాల వినోద్ రెడ్డి, దండి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.