
నవతెలంగాణ – జుక్కల్
సోమవారం తేది 15 జులైన రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు అంగన్ వాడీ టీచర్లు, ఆయాల డిమాండ్స్ నెరవెర్చాలని కోరుతూ జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల ముట్టడిని నియేాజకవర్గంలోని ఎనమిది మండలాల విధులు నిర్వహిస్తున్న అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు భారీగా జుక్కల్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడి, డిమాండ్లతో కూడీన వినతి పత్రం అందించడం జర్గుతుందన్నారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కమిటి సబ్యుడు సురేష్ గొండ ఒక ప్రకటనలో ఆదివారంనాడు తెలిపారు.