కోల్కతా: టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తీవ్ర గాయమైంది. పార్టీ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆమె నుదుటిపై గాయానికి సంబంధించిన ఫొటోలను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. దీదీ కోలుకోవాలంటూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. సీఎం ప్రస్తుతం కోల్కతాలోని ప్రభుత్వ ఎస్ఎస్కేఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. అయితే గాయానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మమతా బెనర్జీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోడీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీడీపీ అధినేత చంద్రబాబు, రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు.
జనవరిలోనూ ఓ కారు ప్రమాదంలో మమతా తలకు స్వల్ప గాయమైంది. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం బర్ధమాన్ నుంచి కోల్కతాకు తిరిగి వస్తుండగా.. ఆమె కాన్వారుకు ఎదురుగా ఉన్నట్టుండి మరో వాహనం రావడంతో దాన్ని తప్పించేందుకు డ్రైవర్ కారుకు బ్రేక్లు వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం.. విండ్షీల్డ్కు ఢకొీనడంతో తలకు స్వల్ప గాయమైనట్టు అధికారులు వెల్లడించారు.