
నల్గొండ జిల్లా,నాగార్జునసాగర్ నియోజకవర్గం, నిడమనూరు మండలం,ముప్పారం గ్రామానికి చెందిన బండారు నాగమ్మ, (70)అనారోగ్యం తో స్వర్గస్తులు అయ్యారు. గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి ద్వారా తెలుసుకొని మృతుని కుటుంబానికి అండగా నేనున్నానంటూ బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి అంత్యక్రియలు అనంతరం బుధవారం భోజనాలు తన ఫౌండేషన్ ద్వారా పంపించారు. ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడు అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి తెలిపారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరారు. పాండురంగారెడ్డి మాట్లాడుతూ అన్నదానం కోటిగోవుల దాన ఫలితంతో సమానమైనదని దానాలన్నింటిలో కెల్లా అన్నదానం మిన్న అని అన్నారు. మనిషిని పూర్తిగా సంతృప్తి పరచేది ఒక్క అన్నదానం మాత్రమేఅని భగవంతుడు ఇచ్చిన సంపదలో మనిషి బ్రతికివున్నన్ని రోజులు నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.