ప్రజా సమస్యల పరిష్కారానికై పోరాటాలు ఉదృతం: మంగ నరసింహులు 

Struggles to solve public problems: Manga Narasimhuనవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
ప్రజా సమస్యల పరిష్కారానికై పోరాటాలు ఉధృతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నర్సింహులు అన్నారు. సోమవారం, యాదగిరిగుట్ట మండలం  కాచారం, గౌరాయపల్లి సీపీఐ(ఎం) గ్రామ శాఖ మహాసభలు దుంపల మధుసూదన్ రెడ్డి, పసునూరి అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మంగ నరసింహులు మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం కోసం పోరాటాలు ఉధృతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బబ్బురి పోశెట్టి, దుంపల రామిరెడ్డి, వంటేరు పెంటా రెడ్డి, నాలపట్ల శంకర్, దుంపల రజిత, ఇంజలింగం, బబ్బురి శ్రీనివాస్, వడ్లకొండ బిక్షపతి, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.