మండలంలోని ఉప్లూర్ అంగన్వాడి ఆధ్వర్యంలో అమ్మ మాట…అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా శనివారం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాన్ని నిర్వహించారు. తల్లుల సమక్షంలో సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు నిర్వహించి చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ సరిత మాట్లాడుతూ.. అంగన్వాడీలో ఎలాంటి ఒత్తిడి లేకుండా చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యాబోధన అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టికాహారం అందిస్తున్నామని, అంగన్వాడి కేంద్రాలను చిన్నారుల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలను తప్పకుండా అంగన్వాడి కేంద్రాలలో చేర్చాలని చిన్నారుల తల్లులకు సూచించారు. వారం రోజుల నుండి విద్యార్థులకు నేర్పిన విద్య బోధనలు తల్లిదండ్రుల సమక్షంలో సమీక్షించారు. అనంతరం అక్షరాభ్యాసం చేయించిన చిన్నారులతో అక్షరాలను దిద్దించారు.కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ సరిత, ఆయాలు పసుపుల లక్ష్మి, డాకూరి లక్ష్మి, తల్లులు, కిశోర బాలలు, తదితరులు పాల్గొన్నారు.