– తమిళనాడులో నలుగురు మృతి
చెన్నై: తమిళనాడులోని బాణా సంచా గోడౌన్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి గోడౌన్ బిల్డింగ్తో సహా చుట్టు పక్క ల మరో ఐదు ఇండ్లు నేలమట్ట మయ్యాయి. ఎగిసిపడుతున్న మంట లను ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ దుర్ఘటన లో గోడౌన్ సిబ్బంది నలుగురు చనిపోయారని అధికారులు తెలిపారు. కృష్ణగిరి పాతపేటలోని ఓ బాణా సంచా ఫ్యాక్టరీ గోడౌన్ లో శనివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోడౌన్ కు నిప్పంటుకోవడంతో భారీ పేలుడు సంభవించింది. దీంతో నలుగురు చనిపోగా మరో 20 మంది గాయపడ్డారు. బాధితులను ఆస్పత్రికి తరలించామని, బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం వెతుకుతున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.