పవర్‌ఫుల్‌ కంటెంట్‌తో మాయవన్‌ సీక్వెల్‌

పవర్‌ఫుల్‌ కంటెంట్‌తో మాయవన్‌ సీక్వెల్‌సందీప్‌ కిషన్‌, డైరెక్టర్‌ సివి కుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్‌ హిట్‌ ‘ప్రాజెక్ట్‌జెడ్‌/మాయవన్‌’ తర్వాత సెకండ్‌ పార్ట్‌ కోసం రెండవసారి చేతులు కలిపారు. ‘మాయవన్‌’ అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సీక్వెల్‌ను ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రాన్ని అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సమర్పిస్తోంది. రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు నీల్‌ నితిన్‌ ముఖేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో తన ఫస్ట్‌ పవర్‌ ప్యాక్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్నారు. సందీప్‌ కిషన్‌, నీల్‌ ఇద్దరూ ఈ సినిమాలో యాక్షన్‌-ప్యాక్డ్‌ పాత్రలలో కనిపించదానికి కొత్తగా మేక్‌ఓవర్‌ అయ్యారు. ఇందులో సందీప్‌ కిషన్‌ సరసన ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పలు ఓటీటీ సిరీస్‌లలో నటించిన ఆకాంక్ష ఈ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇస్తోంది. టాప్‌-క్లాస్‌ ప్రొడక్షన్‌, టెక్నికల్‌ స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం, సూపర్‌విలన్‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా ఉండబోతుంది. ఈ మాయవన్‌ సీక్వెల్‌ సైతం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా మెప్పిస్తుందనే దీమాని మేకర్స్‌ వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: సివి కుమార్‌, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, డీవోపీ: కార్తీక్‌ కె తిల్లై, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌.