చిరంజీవి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. సామాన్యుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టి, ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని, భారతదేశంలోనే అగ్ర నటుల్లో ఒకరిగా ఎదిగారు. అలాంటి చిరంజీవి ప్రశంసలు అందుకోవడం అంటే, యువ ఫిల్మ్ మేకర్స్కి అవార్డు గెలుచుకోవడం లాంటిది. ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’ చిత్రం బందం ఆ ఘనతను సాధించింది. 2022లో విడుదలై ఘన విజయం సాధించిన ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో ‘టిల్లు స్క్వేర్’ సినిమా మార్చి 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో నవ్వులు పూయిస్తూ మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తూ సంచలనాలు సష్టిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.68 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ‘టిల్లు స్క్వేర్’ చిత్రం.. రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన చిరంజీవి చిత్ర బందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాదు ఈ సినిమా తనకెంతో బాగా నచ్చితందని తెలిపారు.