ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రజక జన సేవా సంఘం సభ్యులు బిఆర్ఎస్ లో చేరిక

– రజక కులస్తులకు ఎల్లవేళలా అండగా ఉంటా
– చెరువులకు వెళ్లి బట్టలు ఉతికే సంస్కృతి మారాలి
– మాడ్రన్ పద్ధతిలో జిల్లాలో రూపాయలు రెండు కోట్ల వ్యయంతో దోబిగాట్ల ఏర్పాటు
– అభివృద్ధిని చూసి బిఆర్ఎస్ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి అభినందనలు
– రజక సేవ సంఘం సభ్యులు బి.ఆర్.ఎస్ పార్టీ లో చేరిక సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో రజక జన సేవా సంఘం సభ్యులు 150 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు
ఆదివారం అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ప్రజల పట్ల వారు పడుతున్న తపన సంక్షేమ పథకాలను చూసి, కులాల పట్ల చూపిస్తున్న ప్రేమ అభిమానానికి బిఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో సబ్బన్న వర్గాలు సుఖశాంతులతో ఉండాలని ఉద్దేశంతో అన్ని వర్గాలకు సమైక్యత న్యాయం చేస్తున్నారని తెలిపారు. రజకులు చెరువులకు వెళ్లి ఉతికి సంస్కృతి మారాలని మాడ్రన్ పద్ధతిలో దోబిగాట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ నగరం లో న్యాల్కల్ రోడ్లో రూ. రెండు కోట్లతో మాడ్రన్ ధోబిఘాట్లను నిర్మించడం జరుగుతుందని అన్నారు.త్వరలోనే భూమి పూజ పనులు చేపడతామని అన్నారు. దోబీ ఘాట్ లో మిషన్లతో పని చేసే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంపీసీ కులాలకు బిసి గ్రాంట్ నుంచి ఒక కుటుంబానికి లక్ష రూపాయల సహాయం అందజేస్తున్నారని అన్నారు. గతంలో నిజాంబాద్ జిల్లాలో గుంతల రోడ్లు ఉండేవని ప్రస్తుతం సుందర రోడ్లు సెంటర్ మీటింగ్ లైట్స్ ఉన్నాయన్నారు. నిజామాబాద్ జిల్లా అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అండర్ గ్రౌండ్, సెంటర్ మీటింగ్, ఎల్ఈడి లైట్లు నగరం వెలిగిపోతుందని అన్నారు. అన్ని కుల సంఘాల వర్గాలకు ఎల్లప్పుడు తోడుగా ఉంటానని ఎలాంటి సమస్య అయినా పరిష్కరిస్తానని తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ ,నుడ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి బి ఆర్ ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు సిర్ప రాజు, సత్య ప్రకాశ్, రజక జన సేవా సంఘం అధ్యక్షులు మాందారం సుదర్శన్, ప్రధాన కార్యదర్శి బగ్గలి అజయ్, ఉపాధ్యక్షులు మల్లెపూల గోపి, శేఖర్, జాయింట్ సెక్రెటరీ బగ్గలి కృష్ణ, మహిళా సభ్యులు భాగ్య, మానస ,భూలక్ష్మి ,సావిత్రి తదితరులు పాల్గొన్నారు