ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనది మంత్రి మహేందర్‌ రెడ్డి

Teaching profession is very sacred Minister Mahender Reddyనవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్ర, గౌరవప్రద మైనదని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గనుల, భూగర్భవనరుల శాఖ మంత్రి డాక్టర్‌ పట్నం మహేందర్‌ రెడ్డి అన్నారు. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకుని కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాని కి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, 75 మంది జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు రాహుల్‌ శర్మ, లింగ్యానాయక్‌, ట్రైనీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ అమిత్‌ నారాయణ్‌, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సుశీల్‌ కుమా ర్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల రమేష్‌, ఎంపీ పీ చంద్రకళ, జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి లతో కలిసి ఘనంగా సన్మానించి ప్రశంసా పత్రాలు, మెమొంట్స్‌తో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కనిపించే దైవంగా ఎందరో గొప్ప వ్యక్తులను తీర్చిదిద్దిన ఘనత గ్రామీణ ఉపాధ్యాయులదేనన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం లక్ష 87 వేల కోట్ల నిధులను ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధ్యతగా తీసుకొని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి, ఉపాధ్యాయులకు సహకరించాలని మంత్రి కోరారు.
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులది ముఖ్యపాత్ర : జిల్లా కలెక్టర్‌
జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ… సమాజ నిర్మాణాల్లో ఉపాధ్యాయులు ముఖ్య పాత్ర పోషిస్తారన్నారు. ఉపాధ్యాయులు మంచి విద్యను అందిస్తూనే విద్యార్థులు నైతిక విలువలు పాటించే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల దని కలెక్టర్‌ తెలిపారు. విలువలతో కూడిన విద్యను అందించడంతో పాటు భారతీయ సంస్కతి సాంప్రదాయాలతో ముందుకు సాగాలని కలెక్టర్‌ ఉపాధ్యాయులకు సూచించారు.
ఈ సందర్భంగా సమగ్ర శిక్షణా, భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ సహకారంతో రూ.5 లక్షల 51 వేల 340 వ్యయంతో 192 మంది వికలాంగ విద్యార్థులకు 278 ఉచిత ఉపకరణాలను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యా య సంఘాల నాయకులు, మండల విద్యాశాఖ అధి కారులు, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.