
నవతెలంగాణ – మల్హర్ రావు
మంథని నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో బాధపడుతున్న పేద ప్రజలకు ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి ఏల్ఓసీలు మంజూరు చేయించి పేదలకు తెలంగాణ రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయుతనిస్తూ,ఆర్థికంగా అదుకుంటున్నారు. ఈ క్రమంలో కాటారం మండలంలోని శంకరంపల్లి గ్రామానికి చెందిన ఉరుకొండ ప్రశాంత్ అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. వైద్య ఖర్చుల నిమిత్తం ఆదుకోవాలని మంత్రి శ్రీధర్ బాబుకు బాధితుని కుటుంబ సభ్యులు ఇటీవల విన్నవించారు. ఇందుకు మంత్రి స్పందించి రూ.2.10 లక్షల ఎల్ఓసీ మంజూరు చేయించారు. సోమవారం మంత్రి సహాయకులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు. ఇందుకు మంత్రి దుద్దిళ్లకు బాధితుని కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.