నవతెలంగాణ-అశ్వారావుపేట
నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే నా ధ్యేయం అని అందులో భాగంగానే సుందరీకరణకు నిధులు మంజూరు చేయించానని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఆయన అశ్వారావుపేట పట్టణంలో సెంట్రల్ లైటింగ్ పనులకు లాంచనంగా శంకుస్థాపన చేసారు. ఖమ్మం-అశ్వారావుపేట 325 బి.బి జాతీయ రహదారిలో 119/0 (పేరాయిగూడెం) నుండి 121/0 జంగారెడ్డిగూడెం రోడ్లో కాకతీయ గేట్ వరకు 2 కి.మీ మేర రూ.9 కోట్లు, అశ్వారావుపేట-భూర్గంపాడ్ రోడ్లో 0/0 (పోలీస్ స్టేషన్) నుండి 1/5 అరకిలోమీటరు వరకు రూ.1 కోటి 35 లక్షల వ్యయంతో రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు పేరాయిగూడెం, పోలీస్ స్టేషన్ల సమీపంలో శంకుస్థాపనలు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులు విస్తరణ,సెంట్రల్ లైటింగ్ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెల్లి 23 కోట్ల 50లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజరు కుమార్ నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారన్నారు. అలాగే సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించిన సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆయన్ను పుర ప్రముఖులు సన్మానించారు. అనంతరం అన్ని శాఖల అధికారులతో సమావేశం అయ్యారు. దశాబ్ది వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరామమూర్తి, జెడ్పీటీసీ వరలక్ష్మి, ఆర్అండ్బి డీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీనివాస్, జెటీఓ క్రిష్ణార్జున రావు, కాంట్రాక్టర్ ఎన్టీ వెంకటేశ్వరరావు, సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.