పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 

వేల్పూర్ మండల కేంద్రంలోని స్వగృహంలో గురువారం తన పుట్టినరోజు వేడుకలను  మాజీ మంత్రి, బాల్కొండ శాసనసభ్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఘనంగా జరుపుకున్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో భారీ కేకును కట్ చేశారు.ఈ సందర్భంగా ఆయనకు బాల్కొండ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, పార్టీ శ్రేణులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చాలను  అందించి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రశాంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా నియోజకవర్గం నుండి తరలివచ్చిన పార్టీ శ్రేణులతో మంత్రి స్వగృహం కిటకిటలాడింది. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు తరలివచ్చిన పార్టీ శ్రేణులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.