నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దూలపల్లి మెయిన్ రోడ్డులో ఎస్.ఎన్.డి.పి ఆధ్వర్యంలో రూ.8.45 కోట్లతో చేపడుతున్న కల్వర్టు , రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను సోమవారం ఎమ్మెల్యేలు కేపి వివేకానంద్ , మైనంపల్లి హనుమంత రావు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ , అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు హెచ్ఎండిఏ చేపడు తున్న రోడ్డు వెడల్పు పనులకు అనుగుణంగా కల్వర్టు నిర్మాణ పనులను పెంచాలని, అందుకు అవసరమైన నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. 40% పనులు పూర్తి కావడంతో మిగిలి ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలని అధికారులను వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ నారాయణ, డిఈ నరేందర్, ఏఈ లక్ష్మీ నారాయణ, స్థానిక వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, పాక్స్ చైర్మన్ నరేందర్ రాజు , స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.