జిపి కార్మికుల సమ్మెకు ఎమ్మార్పీఎస్ మద్దతు

నవతెలంగాణ-వీణవంక
గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె కు ఎమ్మార్పీఎస్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. వీణవంక మండల కేంద్రంలో సమ్మె శిబిరాన్ని సందర్శించిన ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పర్లపల్లి తిరుపతి ఆధ్వర్యంలో సమ్మెకు మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు ఇంజం వెంకటస్వామి సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామపంచాయతీ  కార్మికుల వేతనాల పెంపు మరియు పర్మనెంట్ కోసం నేటికీ ఆరు రోజులు గడుస్తున్నా కానీ. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం సోచనియం అన్నారు. వీణవంక మండల పరిధిలోని 26 గ్రామాల పంచాయతీ  కార్మికులు సంపూర్ణంగా సమ్మె చేస్తున్నారు.  పారిశుధ్యం పనులు పక్కుకు పోయేస్తితికి ప్రభుత్వం తీసుకు వచ్చింది.కార్మికులు అనేక సంవత్సరాల తరబడి పోరాడుతున్నప్పటికీ న్యాయం చేయలేదు. ఈ సమ్మె డిమాండ్స్ పరిష్కరించాలి.ఉద్యోగ భద్రత లేకుండా,వేతనాలు ప్రతి నెల చెల్లించకుండా, రెండు మూడు నెలలు పెండింగ్ పెడుతూ ఒకపక్క మండల అధికారులు, గ్రామ సర్పంచులు,కార్యదర్శుల వేధింపులు ఎక్కువవుతున్నాయని జీతాలు ఇవ్వాలని అడిగిన కార్మికులను పనులను తొలగిస్తున్నారని,కార్మికుల ఉద్యోగ భద్రత, జీవో నెంబర్ 60 ప్రకారం 30% పిఆర్సి పేంపు అమలు చేయాలని, పీఎఫ్ ఇఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, ప్రమాదవశాస్తు మరణించిన కార్మికుల కుటుంబానికి 5 లక్షలు ఇన్సూరెన్స్ సౌకర్యం, పిఎఫ్, ఈఎస్ఐ అందించాలని, మల్టీపర్పస్ 51 జీవోను సవరించి, కేటగిర్ల వారిగనే పనులు కొనసాగించాలని, కారోబార్లను పంచాయతీ సహాయ కార్యదర్శి లుగా నియమించాలని తదితర డిమాండ్ల లో సాధన కోసం నిరవధిక సమ్మెలోకి వెళ్లారు అని తెలిపారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలిచి పరిష్కారం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పులి ప్రకాష్, కండె మహేందర్, అంతడుపుల సంపత్, గ్రామపంచాయతీ కార్మికులు మహంకాళి కొమురయ్య, కండే సదయ్య, దసారపు వెంకటేష్, కిషన్ రావు, గోడిసేలా కొమురయ్య, దసారపు మల్లయ్య, శంకర్ వీరితోపాటు గ్రామాల కార్మికులు పాల్గొన్నారు.