– సర్వీసుల సంఖ్య పెంపు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఎమ్ఎమ్టీఎస్ సర్వీసులను మేడ్చల్ వరకు పొడిగించినట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ తెలిపారు. దానితోపాటే సర్వీసుల సంఖ్యను కూడా పెంచినట్టు బుధవారంనాడొక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. జంటనగరాల నుంచి 90 రూట్ కిలోమీటర్ల పరిధి వరకు ఎమ్ఎమ్టీఎస్ రైళ్లు నడుస్తున్నాయని వివరించారు. సికింద్రాబాద్-మేడ్చల్ మధ్య 20 ఎమ్ఎమ్టీఎస్ రైళ్లు నడుస్తున్నాయనీ, ఫలక్నుమా-ఉందానగర్ మధ్య 20 సర్వీసుల్ని పొడిగించామన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే/వచ్చే ప్రయాణీకులు ఉందానగర్ చేరుకొని, అక్కడినుంచి వెళ్లొచ్చని సూచించారు. అతితక్కువ టిక్కెట్ ధరతో వేగవంతమైన ప్రయాణం ఎమ్ఎమ్టీఎస్తో సాధ్యమవుతుందని తెలిపారు. కనిష్టంగా రూ.5 నుంచి గరిష్టంగా రూ.15 వరకే టిక్కెట్ చార్జీ ఉంటుందన్నారు. దీనివల్ల శివారు ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.