
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లిలో గురువారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో దోమల నివారణ చర్యలు చేపట్టారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది గ్రామంలో వర్షం నీరు నిలిచిన గుంతల్లో, మురికి కాలువల వెంట దోమలు వృద్ధి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లారు. దోమల లార్వాను చంపేందుకు, దోమల నివారణ కోసం నీటి మడుగులో ఆయిల్ బాల్స్ వేశారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి గంగ జమున మాట్లాడుతూ నీటి గుంతల్లో ఆయిల్ బాల్స్ వేయడం, బ్లీచింగ్ పౌడర్ చల్లడం ద్వారా దోమల వృద్ధిని నివారించవచ్చని తెలిపారు. ప్రజలు కూడా సీజనల్ వ్యాధులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, రోజుల తరబడి నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెందేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. పాడైన వస్తువుల్లో రోజుల తరబడి నీలో ఉన్న నీటిని పారబోయాలని గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.