నవతెలంగాణ – మల్హర్ రావు
అక్రమ అరెస్టులతో ఉద్యమాలనాపలేరని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు పొలం రాజేందర్ అన్నారు. మంగళవారం పలిమేల మండలంలోని బోదయిగూడెంలో సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సూదుల శంకర్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు మాట్లాడుతూ. మంగళవారం తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు మెడిగడ్డ సందర్శనకు వస్తున్న నేపథ్యంలో ఉదయం 6 గంటలకు సీపీఐ(ఎం) పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బందు సాయిలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కారల్ మర్క్స్ కాలనిలో హౌస్ అరెస్టు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలు చేయడానికి 100 రోజుల గడువు అడిగింది అందరికి తెలిసేందే, ఆ గడువు పూర్తి కావాలని మేము వేచిచూస్తున్నపటికి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకపోయినా, ప్రజలకు పిలుపు ఇవ్వకపోయినా అక్రమంగా అరెస్ట్ చేయడం విడ్డురంగా ఉందన్నారు. ఇది ప్రభుత్వ అత్యుత్సానికి నిదర్శమన్నారు.ఇలాంటి చర్యలకు పూనుకోవడం అప్రజాస్వామికమన్నారు, అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ది పోచయ్య, పెద్ది బాపు,కాపుల.సంతోష్,కోవ్వూరి లక్ష్మయ్య పాల్గొన్నారు.