కాశ్మీర్‌ వ్యాలీలో మిస్టర్‌ బచ్చన్‌

కాశ్మీర్‌ వ్యాలీలో మిస్టర్‌ బచ్చన్‌రవితేజ, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. ప్రస్తుతం కాశ్మీర్‌ వ్యాలీలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 90% షూటింగ్‌ పూర్తి చేసుకుని, ముగింపు దశకు చేరుకుంది. తాజా షెడ్యూల్‌లో రవితేజ, భాగ్యశ్రీ బోర్స్‌ పై బ్యూటీఫుల్‌ మెలోడీ డ్యూయెట్‌ని షూట్‌ చేస్తున్నారు. ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. కాశ్మీర్‌లోని అద్భుతమైన లోకేషన్లలో ఈ పాట చిత్రీకరణ గత నాలుగు రోజులుగా కొనసాగుతోంది. లొకేషన్‌ సెలెక్షన్‌, సాంగ్‌ జోనర్‌ సినిమాలో విజువల్‌ ఫీస్ట్‌, ఎమోషనల్‌ ఎలిమెంట్‌ని యాడ్‌ చేస్తోంది. 90% చిత్రీకరణ పూర్తి కావడంతో, మిగిలిన పార్ట్స్‌ని చిత్రీకరించే దిశగా టీమ్‌ శరవేగంగా పని చేస్తోంది. రవితేజ, హరీష్‌ శంకర్‌, అద్భుతమైన ప్రొడక్షన్‌ టీమ్‌ సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు అని చిత్ర యూనిట్‌ తెలిపింది. జగపతి బాబు, సచిన్‌ ఖేడేకర్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల, సమర్పణ: పనోరమా స్టూడియోస్‌, టీ-సిరీస్‌, సంగీతం: మిక్కీ జె మేయర్‌, డీవోపీ: అయనంక బోస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌: బ్రహ్మ కడలి, ఎడిటింగ్‌: ఉజ్వల్‌ కులకర్ణి.