ముదిరాజులను బీసీడీ నుండి బీసీఏకు మార్చాలి

నవతెలంగాణ – మిరు దొడ్డి
ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించాలని ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు తుమ్మల బాలరాజు అన్నారు. మండల కేంద్రమైన మిడిదొడ్డిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఎన్నికల్లో ముదిరాజు లను ఓటుబ్యాంక్ గా చూస్తున్న రాజకీయ నాయకులకు  తగిన రీతిలోగుణపాఠం చెప్పాలన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజ్ జనాభా అని అనుసరించి నాలుగు ఎంపీ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్థికపరమైన షాక్ చూపించకుండా జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటాయించాలన్నారు. ముదిరాజులను బి సి డి నుంచి  బి సి ఏ కు మార్చాలన్నారు . ముదిరాజులు ఏకమైతే పరిపాలన మారుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ మండలం అధ్యక్షులు తుమ్మల విద్యాసాగర్ ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు కరాటి శివకుమార్, మాజీ ఎంపిటిసి గొట్టం బైరయ్య, నాయకులు బోయి నాగభూషణం, ఉషికే కనకరాజు, నరేశ్ ,రామచంద్రం, నాగరాజు, రాజశేఖర్ ,తుమ్మల చంద్రం తదితరులు పాల్గొన్నారు.