నూతన బోర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్..

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని 24వ, వార్డులో నీటి సమస్య ఉంది అని కౌన్సిలర్ చైర్ పర్సన్ దృష్టికి తీసుకురావడం వల్ల వెంటనే ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సహకారంతో సోమవారం బోర్ వేయించడం జరిగిందనీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందు ప్రియా చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాలనీలోని నీటి సమస్య తీర్చడానికి తన వంతు కృషి చేయడం జరిగిందన్నారు. చెట్లు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చెట్లను పెంచడం వల్ల పర్యావరణాన్ని కాలుష్యం కాకుండా నివారించవచ్చు అన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తుందున ప్రతి ఒక్కరు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రతను పాటించాలని, పరిసరాలు నీటిగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలోని,వార్డు కౌన్సిలర్, ఇల్లందుల లతా వేణు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.