నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిశారు. బుధవారం హైదరాబాద్ లో జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో నిర్మాత బండ్ల గణేశ్తో కలిసి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ నెల19న గచ్చిబౌలిలోని స్టేడియంలో నిర్వహించనున్న మ్యూజికల్ కార్యక్రమానికి రావాలంటూ సీఎం, డిప్యూటీ సీఎంను ఆయన ఆహ్వానించారు.