ముత్తారం పీఎసీఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం..

– ముత్తారం పిఎసిఎస్ చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం
నవతెలంగాణ- ముత్తారం: ముత్తారం మండలంలోని  వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి వైస్ చైర్మన్ పోతుపెద్ది రమణ రెడ్డిలపై గురువారం సహకార సంఘం డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదన చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వైస్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదించిన 9 మంది డైరెక్టర్లు జిల్లా సహకార సంఘ సబ్ రిజిస్టర్ రామ్మోహన్ కు అవిశ్వాస తీర్మానాన్ని అందజేశారు. డైరెక్టర్ లు అల్లడి యాదగిరి రావు, గుజ్జ  గోపాలరావు, ఏలువాక కొమురయ్య, కొంకటి మల్లన్న, మద్దెల వెంకటలక్ష్మీ, నాయిని పార్వతమ్మ, సముద్రాల వాణి, ముడుసు ఓదెలు, అల్లం గోవర్ధన్ సబ్ రిజిస్టర్కు నోటీసులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పూదారి సర్వేష్, మాజీ జడ్పీటీసీ లు చొప్పరి సదానందం, నాగినేని జగన్ మోహన్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, కాంగ్రెస్ నాయకులు గుజ్జ లింగారావు, రామగిరి మహేందర్, వెల్మరెడ్డి సంజీవరెడ్డి, నల్లాల శ్రీను, గాదం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.