నెహ్రూ యువ కేంద్ర…17 జూన్ యోగా వాక్ కార్యక్రమం..

నవతెలంగాణ – కంటేశ్వర్: అంతర్జాతీయ యోగా దినోత్సవం -2023 సందర్భంగా సన్నాహక కార్యక్రమాలలో భాగంగా నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ ఆధ్వర్యంలో 17 జూన్ ఉదయం 6గం లకు యోగా వాక్ కార్యక్రమం నిర్వహించబడుతుంది అని జిల్లా యువజన అధికారిణి నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమం గాంధీ చౌక్ లో ప్రారంభమై, కలెక్టర్ గ్రౌండ్ లో ముగుస్తుంది అని తెలిపారు.మార్గమధ్యంలో యోగా సాధకులు యోగాసనాలు ప్రదర్శనలు చేస్తారు అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో యోగా సాధకులు,యువతీయువకులు, పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొనవలసిందిగా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అని తెలియజేశారు.