– విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా
న్యూఢిల్లీ : రాష్ట్రంలో నకిలీ ఓట్లపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా విచారణ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినందున ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో దొంగ ఓట్లపై మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలోని సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ మిశ్రా ప్రకటించారు. దీంతో సిజెఐ ఆదేశాలతో మరో ధర్మాసనం ముందు జాబితా చేయాలని రిజిస్ట్రీకి జస్టిస్ బిఆర్ గవాయి సూచించారు.