క్రిస్టల్‌ వార్షికోత్సవాన్ని జరుపుకున్న నోవాటెల్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌

– హృదయ పూర్వకమైన కృతజ్ఞతా వారం
నవతెలంగాణ-శంషాబాద్‌
నోవాటెల్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ తన అద్భుతమై న ప్రయాణంలో భాగంగా క్రిస్టల్‌ 15వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. మంగళవారం తమ ఉద్యోగులు, ముఖ్య వాటాదారుల అమూల్యమైన సహకారాన్ని గుర్తించడానికి ప్రాపర్టీ హార్టీయెస్ట్‌ గ్రాటిట్యూడ్‌ వీక్‌ నిర్వహించింది. తామ కార్యకలాపాలు ప్రారంభించిన ఒకటిన్నర దశాబ్దంలో నోవాటెల్‌ హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ అతిథులకు సౌకర్య వంతమైన, విలాసవంతమైన, అసాధారణమైన, వ్యక్తిగతీక రించిన సేవలను అందించడం ద్వారా తమ కంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకుంది. కొన్నేండ్లుగా తమ ఆవిష్కరణ, అత్యుత్తమ కార్యక్రమాలను వేగవంతం చేసింది. కస్టమర్‌ అనుభవం, సంతృప్తిని మెరుగుపరచడా నికి ప్యాచ్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు, అలాగే లాబీ, గౌర్మెట్‌ బార్‌, ఫుడ్‌ ఎక్స్ఛేంజ్‌ వంటి సౌకర్యాలతో ఆధునీకరణ చేపట్టింది. ‘హార్టీయెస్ట్‌ గ్రాటిట్యూడ్‌ వీక్‌’లో భాగంగా, హౌటల్‌, తమ ఉద్యోగులపై ప్రశంసల వర్షం కురిపిస్తూ విస్తృతమైన కార్యక్రమంను ఏర్పాటు చేసింది. హౌటల్‌ విజయానికి దోహదపడుతూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన సేవల ను అందించడంలో ఉద్యోగి ప్రయత్నాలను గుర్తించే లక్ష్యం తో 3-రోజుల కార్యక్రమం ప్రణాళిక చేసింది. ఉద్యోగులకు విలాసవంతమైన అల్పాహారంతో క్రిస్టల్‌ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జుంబా కార్యక్రమం తర్వాత జట్లు ఉత్తేజకరమైన మారథాన్‌లో కూడా పాల్గొన్నాయి. టీమ్‌ స్పిరిట్‌ను పెంపొందించడానికి ఉద్యోగుల కోసం అన్ని రోజులు వివిధ వినోదభరితమైన కార్యక్రమాలతో నిండిపోయాయి. ఈ సందర్భంగా నోవాటెల్‌ హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ జనరల్‌ మేనేజర్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ మాట్లాడు తూ 15 ఏండ్ల ప్రయాణం ఒక అద్భుతమైన సాహసం, అంకితభావం, అసాధారణమైన అతిథి అనుభవాలను అందించాలనే ప్రయత్నంతో కూడిన అభిరుచితో గుర్తించబడిందని తెలిపారు. తమ విజయాలు, ఇటీవలి ఆవిష్కరణల నుండి పరివర్తనాత్మక పునర్నిర్మాణాల వరకు, బృందం తిరుగులేని నిబద్ధతకు నిదర్శనంగా నిలుస్తాయని అన్నారు. తాము మరింత ముందుకు చూసినప్పుడు, అతిథి అంచనాలను అధిగమిస్తామని, వారసత్వాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు.