న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టిపిసి శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి రూ.1487 కోట్ల డివిడెండ్ను అందించింది. 2022-23కు గాను తుది డివిడెండ్ కింద ఈ మొత్తాన్ని ప్రకటించింది. పెయిడ్ అఫ్ కాపిటల్ కింద మరో రూ.2,908.99 కోట్లు ఇచ్చింది. దీంతో 2022-23లో మొత్తంగా రూ.7,030.08 కోట్ల డివిడెండ్ కేంద్రానికి అందించినట్లయ్యింది. వరుసగా 30 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ను ప్రకటిస్తున్నట్లు ఎన్టిపిసి పేర్కొంది.