28న ఎన్‌టిఆర్‌ నేషనల్‌ లెజెండరీ అవార్డ్స్‌

ఫిలిం అండ్‌ టెలివిజన్‌ కౌన్సిల్‌ అఫ్‌ ఇండియా ఎన్‌ టిఆర్‌ శత జయంతి ఉత్సవాల ముగింపుని పురస్కరించుకుని తెలుగు సినిమా వేదిక సౌజన్యంతో నిర్వహిస్తున్న ఎన్టీఆర్‌ లెజెండరీ నేషనల్‌ అవార్డ్స్‌ కర్టెన్‌ రైజర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖా మాత్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆవిష్కరించారు. మంత్రి క్యాంపు ఆఫీస్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కాదంబరి కిరణ్‌ అతిథిగా విచ్చేసారు. ఎఫ్‌టిపీసి అధ్యక్షులు చైతన్య జంగా, తెలుగు సినిమా వేదిక అధ్యక్షులు వీస్‌ వర్మ పాకలపాటి, అవార్డ్స్‌ కమిటీ సభ్యులు విశ్వనాథ్‌, రాంచంద్‌, నాగార్జున రెడ్డి, శ్రీనివాస్‌ పాల్గొన్న ఈ వేడుకలో గ్లోబల్‌ మోడల్‌ అవార్డు విన్నర్‌ ఐశ్వర్య రాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
విశ్వవిఖ్యాత నటులు ఎన్టీఆర్‌ శతజయంతి ముగింపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనుండటం పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఎనిమిది రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన ఈ సినీ సామాజిక పురస్కార సంబరం ఈ నెల 28న ప్రసాద్‌ ల్యాబ్‌లో జరగనుందని, ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారని చైతన్య జంగా, వీస్‌ వర్మ పాకలపాటి తెలిపారు.