అధికారికంగా సూదిని జైపాల్‌రెడ్డి జయంతి

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సూదిని జైపాల్‌రెడ్డి 83వ జయంతిని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈనెల 16న ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో సంబంధిత అధికారులతో సీఎస్‌ సమీక్ష్షా సమావేశం నిర్వహించారు. నెక్లెస్‌రోడ్‌లో జైపాల్‌రెడ్డి మెమోరియల్‌ స్ఫూర్తిస్థల్‌లో సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని హెచ్‌ఎండీఏ కమీషనర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు, ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా తగు శానిటేషన్‌, పార్కింగ్‌, ట్రాఫిక్‌, భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పేర్కొన్నారు.