25న సైకాలజిస్టులకు ఒకరోజు శిక్షణా: డా హిప్నో పద్మా కమలాకర్

నవతెలంగాణ – హైదరాబాద్
సైకాలజిస్టుల వృత్తి నైపుణ్యాలు పెంపొందించేందుకు సైకియాట్రిస్ట్ డా.రవ్వ హరి కుమార్ తో ఆందోళన నిర్ములనా మార్గాలు పై ఒక రోజు జాతీయ స్థాయి శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్స్ అసోసియేషన్ – ఇండియా, అధ్యక్షురాలు డా హిప్నో పద్మా కమలాకర్, డా.వి.జే.క్యార్లిన్ తెలిపారు. సోమవారం డా.హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 25వ తేదీ శనివారం ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డా హిప్నో కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్,అశోక్ నగర్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. లో జరుగుతుందన్నారు. కరోనా తర్వాత ప్రతి ఒక్కరులో చిన్న విషయానికి ఆందోళన చెందుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సైకాలజిస్ట్ లు ఈ సమస్యను ఎలా అంచనా వేయాలి, వారి మానసిక స్థితి గతులు ఎలా తెలుసుకోవాలి అనే అంశంపై డా.రవ్వ హరి కుమార్ అవగాహన కల్పిస్తారన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డా.జి.వీరభద్రం, డా.వి.జనార్థనం, డా.పి.రమేష్ కుమార్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సైకాలజిస్టులు, సైకాలజీ విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 9390044031 నెంబర్లకు ఫోన్ చేసి తెలుసుకోవాలన్నారు.