– సెకండ్ అడిషనల్ స్పెషల్ జడ్జ్ ఏ సి బి కోర్ట్ నాంపల్లి హైదరాబాద్ మహమ్మద్ అప్రోజ్ ఆక్తర్ తీర్పు
నవతెలంగాణ – కంటేశ్వర్
లంచం తీసుకున్న కేసులో ఏ ఏ ఈ ఎన్పీడీ సీఎల్ నిజామాబాద్ కు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ.లు 10,000/- జరిమానాను విధిస్తూ సెకండ్ అడిషనల్ స్పెషల్ జడ్జ్ ఏ.సి.బి. కోర్టు, నాంపల్లి, హైదరాబాద్ న్యాయమూర్తి మహమ్మద్ అఫ్రోజ్ అక్తర్ మంగళవారం తీర్పునిచ్చారు. 2008 జూలై లో మాక్లూర్ మండలం మదన్ పల్లి తన వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ కనెక్షన్ కోసం సుభాష్ గార్డెన్ యజమాని కేసరి శ్రీనివాస్ రెడ్డి ఏ ఏ ఈ మచ్చ సదాశివ ని సంప్రదించారు. కానీ సదరు అధికారి రూ. 5 వేల లంచం డిమాండ్ చేయడంతో శ్రీనివాస్ రెడ్డి ఏసీబీ అధికారులను కలిసి పిర్యాదు చేసాడు. దీనితో ఆయన నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు 24 న రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. నాంపల్లి ఏసీబీ కోర్టు లో విచారణ జరిగింది. స్పెషల్ పీపీ లక్ష్మి మనోజ్ఞ ఏసీబీ పక్షాన వాదనలు వినిపించారు.నిందితుడి మీద అభియోగాలు రుజువు కావడంతో ఏఏఈ సదా శివ కు ఏడాది జైలు 10 వేల రూపాయల జరిమానా విధిస్తు న్యాయ మూర్తి మహ్మద్ అఫ్రోజ్ అక్తర్ తీర్పునిచ్చారు.జరిమానా చెల్లించనీ పక్షంలో మరో మూడు మాసాలు జైలు శిక్ష అనుభవించాలని ఆయన పేరుకొన్నారు.