
నవతెలంగాణ-మల్హర్ రావు : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో మండలంలో 7వ రోజు గురువారం కొనసాగింది.మండలంలోని రుద్రారం, కొండంపేట,దుబ్బపేట,మల్లంపల్లి, చిన్నతూoడ్ల,ఇప్పలపల్లి,అడ్వా లపల్లి,తాడిచెర్ల,ఎడ్లపల్లి,కొ య్యుర్,నాచారం,ఆన్ సాన్ పల్లి,వళ్లెంకుంట,పెద్దతూoడ,మల్ లారం 15 గ్రామాల్లో మొత్తం 15,25 దరఖాస్తులు లబ్ధిదారుల నుంచి కౌoటర్ నిర్వాహకులు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా ఎంపిపి చింతలపల్లి మలహాల్ రావు,ఎంపిడిఓ నరసింహమూర్తి, స్పెషల్ అధికారి అవినాష్ హాజరై మాట్లాడారు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయబోతున్న ఆరు గ్యారంటీల పథకాలైన మహాలక్ష్మీ, రైతు భరోసా,గృహజ్యోతి,ఇందిరమ్మ ఇండ్లు,చేయూత, ఆహార భద్రత పథకాలకు దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నట్లుగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపిపి బడితేల స్వరూప రాజయ్య,మండల తహశీల్దార్ శ్రీనివాస్, కొయ్యుర్ ఎస్ఐ నరేశ్,ఎంపిటిసి ఏనుగు నాగరాని,సర్పంచ్ గోనె పద్మ శ్రీనివాసరావు, ఆయా గ్రామాల స్పెషల్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలు పాల్గొన్నారు.