– మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కె జగదీశ్వర్ రెడ్డి
నవతెలంగాణ – సూర్యాపేట
అల్ప సంఖ్యాక వర్గాల వారు విదేశాలలో పై చదువుల నిమిత్తం ముఖ్యమంత్రి ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కె జగదీశ్వర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన లో పేర్కొన్నారు.1 జనవరి 2024 నుండి 31 జులై 2024 కాలంలో (స్ప్రింగ్ సీజన్) అడ్మిషన్ తీసుకున్న అర్హత కలిగిన అభ్యర్ధులు www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ నందు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. విద్యార్ధుల తల్లితండ్రుల వార్షిక ఆదాయము రూ. 5 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థుల వయస్సు 35 సం. ల కు మించరాదని తెలిపారు.ఈ పథకము క్రింద ఎంపిక చేయబడిన ప్రతి విద్యార్ధికి స్కాలర్ షిప్ / ఆర్ధిక సహాయము క్రింద రూ. 20,00,000/-(ఇరవై లక్షలు) రెండు విడుతలలో చెల్లిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా విమాన ప్రయాణ చార్జీలు రూ. 60,000/-(అరవై వేలు) మించకుండా చెల్లించడం జరుగుతుందని తెలిపారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా 07.08.2024 సా. 5.00 గంటల వరకు నమోదు చేసుకోవాలన్నారు. ఆన్ లైన్ లో సమర్పించిన దరఖాస్తులను మూడు జతల జిరాక్స్ ప్రతులను సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రూం నంబర్ ఎఫ్ – 05 నందు గల మైనారిటీల సంక్షేమ శాఖ అధికారి కార్యాలయములో అందజేయాలని పేర్కొన్నారు.ఇతర పూర్తి వివరాలకు ఆన్ లైన్ వెబ్ సైట్ లేదా జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధికారి కార్యాలయము, సూర్యాపేట ఫోన్ నం.9247720650 , 9492611057 , నంబర్ లను సంప్రదించాలని కోరారు.