
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
నిర్మల్ జిల్లా బాసరలో గల “రాజీవ్ గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్” నందు మొదటి సంవత్సరం ఇంటిగ్రేటెడ్ బీ.టెక్ నందు ప్రవేశాలకు ఆన్లైన్ ప్రారంభమైనదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ యేడాది పదవ తరగతి, ఉత్తీర్ణులైన విద్యార్ధులు ఈ ప్రవేశాలకు అర్హులని తెలిపారు.
ఈ కాలేజీ నందు కన్వీనర్ కోటాలో 1500, గ్లోబల్ (మేనేజ్ మెంట్ కోటాలో) 150 సీట్లు అందుబాటులో ఉంటాయని, మెరిట్ ఆధారంగా, రిజర్వేషన్లను బట్టి సీట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్దులకు 1,50,000, పట్టణ ప్రాంతానికి చెందిన విద్యార్ధులు 2 లక్షల ఆదాయ ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలని చెప్పారు. ఆసక్తి గల విద్యార్ధులు 3 నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్, పదవ తరగతి మార్కుల జాబిత, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్, తీసుకొని ఈ నెల 22 లోపు డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు. ఆర్ జియుకెటి. ఎసి.ఇన్ (www.rgukt.ac.in) వెబ్సైట్ నందు తమ వివరాలను నామోదు చేసుకోవాలన్నారు. పి.హెచ్.సి, ఎన్.సి.సి, స్పోర్ట్స్, సి.ఎ.పి (ఆర్మీ ఉద్యోగస్తుల పిల్లలు) మాత్రం తప్పని సరిగా ఆన్లైన్లో చేసిన దరఖాస్తును డౌన్లోడ్ చేసుకుని దరఖాస్తుపై విద్యార్ధి సంతకం చేసి, ఈ నెల 29 లోపు, కాలేజ్ కి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలని సూచించారు. ఇతర వివరాల కోసం 8520860785,7416305245,7416058245 లకు సంప్రదించాలని పేర్కొన్నారు.