
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ..
నవతెలంగాణ – భువనగిరి రూరల్
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకించి, వ్యవసాయ కూలీల, రైతుల, కార్మికుల హక్కుల కోసం ఈనెల 16 న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామీణ బంద్, సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. సోమారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనాజిపురం గ్రామంలో గ్రామీణ గ్రామీణ బంద్, సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రం ను ఆవిష్కరించి, మాట్లాడారు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎత్తివేయాలని కుట్రలో భాగంగా ప్రతి సంవత్సరము బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ కొత్త కొత్త జీవోలు తెస్తూ ఉపాధి హామీలో పని చేస్తున్న కూలీల సంఖ్యను తగ్గించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కూలీలను రెండుసార్ల ఫోటోలు తీయాలని , డ్రోన్ కెమెరాలు వాడాలని, ఆధార్ అనుసంధానం ఉంటేనే కూలీలకు డబ్బులు చెల్లించాలి మోడీ ప్రభుత్వము జీవోలు తీసుకురావడం ఏమిటి అని ప్రశ్నించారు.ఇప్పటికే పని ప్రదేశాల్లో మౌలిక వసతులు ఎత్తివేసిందని, వారం వారం బిల్లులు చెల్లించడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వము పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించి, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు కల్పించి, రోజు కూలి 800 రూపాయలు ఇవ్వాలని, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, పట్టణ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న ధరలను అరికట్టి ఆహార వస్తువులపై, నిత్యవసరాలపై జిఎస్టి ఉపసంహరించుకొని, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, వంట గ్యాస్ లపై కేంద్ర ఎక్సైజ్ సుంకం తగ్గించాలని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ విస్తరించాలని రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యవసర వస్తువులు అందించాలని, ఆహార భద్రత చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, కనీస వేతనము 26 వేల రూపాయలతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, నాలుగు లేబర్ కోడులను రద్దు కోసం, 2022 విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, 2013 భూ సేకరణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అందరికీ విద్యా, వైద్యం, ఉపాధి, కల్పించాలని డిమాండ్స్ తో ఈనెల 16న నిర్వహిస్తున్న గ్రామీణ బంద్ మరియు సమ్మెలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎదునూరు మల్లేశం, మండల అధ్యక్షులు బొల్లెపల్లి కిషన్, మాజీ సర్పంచులు బొల్లెపల్లి కుమార్, ఏదునూరి ప్రేమలత, నాయకులు అబ్దుల్లాపురం వెంకటేష్, ఏదునూరి వెంకటేష్, ముచ్చపతి బాలయ్య, కడారి కృష్ణ, బొల్లెపల్లి పరమేష్, పిట్టల వెంకటేశం, ఎండి. అఫ్జల్, మైలారం శివ, గంగనబోయిన లక్ష్మి, గంగనబోయిన రాజు, తోటకూరి మల్లేశం, వెంకటస్వామి లు పాల్గొన్నారు.