వెన్నెల కిషోర్, కమల్ కామరాజు, మోనికా చౌహాన్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ‘ఒసేరు అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణరు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత గూడూరు ప్రణరు రెడ్డి మాట్లాడుతూ, ‘కమల్ కామరాజు, వెన్నెల కిషోర్, మోనికలతో ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్గా ఈ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తాం’ అని అన్నారు. ‘హైదరాబాద్లోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇల్లాలు అరుంధతి పిల్లాడితో పాటు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ ఉంటుంది. ఓసారి సత్యనారాయణ స్వామి వత్రం చేయాలని అనుకుంటుంది. అయితే అనుకోకుండా అరుంధతికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి తనని తాను కాపాడుకుంటూ ఇంటి పరువును ఎలా కాపాడుకుంటుందనేదే ఈ సినిమా. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో పాటు కామెడీ ప్రధానంగా సాగే చిత్రమిది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం’ అని దర్శకుడు విక్రాంత్ కుమార్ చెప్పారు. వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు, పథ్వీరాజ్, చిత్రం శ్రీను, అరియానా గ్లోరి, సునీతా మనోహర్, టార్జాన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాత- గూడూరు ప్రణరు రెడ్డి, దర్శకత్వం – విక్రాంత్ కుమార్, సినిమాటోగ్రఫీ – సాయి చైతన్య మాటేటి, మ్యూజిక్ – సునీల్ కశ్యప్, ఎడిటర్ – మార్తాండ్ కె.వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – వెంకట్ మద్దిరాల, లైన్ ప్రొడ్యూసర్ – ఎన్.మురళీధర్ రావు, ప్రొడక్షన్ కంట్రోలర్ – వాసు.