నవతెలంగాణ-హైదరాబాద్ ప్రత్యేక ప్రతినిధి
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన వేళ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ బాధ్యతల్లో అచ్చెన్నాయుడు ఉన్నారు. నూతన ప్రభుత్వంలో ఆయనకు మంత్రిగా చోటు దక్కడంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనితో గాజువాక నియోజక వర్గం నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన పల్లా శ్రీనివాస రావును ఏపీ శాఖ అధ్యక్షుడిగా నియమిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు.