సేవాతత్పరుడు  పాండు రంగారెడ్డి

– నేనున్నానంటూ భరోసా
– అండగా ఉంటా… ఆదుకుంటా
నవతెలంగాణ – పెద్దవూర
నాగార్జునసాగర్ ముద్దుబిడ్డ  వైష్ణవి కన్స్ట్రక్షన్స్ అధినేత, బుసిరెడ్డి ఫౌండేషన్ ఛైర్మన్ – బుసిరెడ్డి పాండురంగారెడ్డి నేనున్నానంటూ భరోసా కల్పించడం అందరికి మనోధైర్యం కల్పించి, అండగా వుంటా అన్ని విధాలా ఆదుకుంటా అని అంత్యక్రియలు అనంతరం భోజనాలు పంపిస్తూ మానవత్వం చాటుతున్నారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం, అనుముల మండలం, పంగవానికుంట గ్రామానికి చెందిన బైరు యల్లమ్మ(65) శుక్రవారం స్వర్గస్తులు అయ్యినారని తెలుసుకొని ఆ కుటుంబానికి అండగా బుసిరెడ్డి ఫౌండేషన్ వారు అంత్యక్రియలు అనంతరం భోజనాలు పంపించారు. ఆర్ధికంగా ఇబ్బందివున్న నిరుపేద కుటుంబాలకి మన బుసిరెడ్డి ఫౌండేషన్ ఎల్లపుడూ అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉంటుందని బుసిరెడ్డి పాండురంగారెడ్డి పిలుపునిచ్చారు. సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 9581742356 కు సంప్రదించవలసినదిగా కోరారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. అన్నదానం కోటిగోవుల దాన ఫలితంతో సమానమైనదని, దానాలన్నింటిలో కెల్లా అన్నదానం మిన్నఅని చాటారు. నలుగురిని ఆదరిద్దాం అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.