పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పసర సీఐ శంకర్ మరియు ఎస్ ఐ కమలాకర్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పసర సీఐ శంకర్ మరియు ఎస్ ఐ కమలాకర్నవ తెలంగాణ-గోవిందరావుపేట
రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ముందస్తు చర్యల్లో భాగంగా ఆదివారం మండలంలోని ముత్తాపూర్ మచ్చాపూర్ గ్రామాలలోని పోలింగ్ కేంద్రాలను సిఐ శంకర్ ఎస్ ఐ కమలాకర్ లు పరిశీలించారు.ఈ క్రమంలో ఆ పోలింగ్ సెంటర్స్ లో గతం లో జరిగిన ఎన్నికల గురించి అడిగి తెలుసుకోవటం జరిగింది. ఈ సందర్భం లో సిఐ శంకర్ మరియు ఎస్ ఐ కమలాకర్ మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, ఎలాంటి భయ భ్రాంతులకు,ప్రలోభాలకు గురికాకుండా వినియోగించుకోవాలని ,ప్రజలు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణం లో వేయడానికి వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లను పోలీస్ శాఖ ఏర్పాటు చేస్తుందని తెలియచేసారు.