
మండలంలోని పహిల్వాన్ పురం కు చెందిన వట్టిపెల్లి పవన్ గౌడ్ అఖిల భారత గౌడ సంఘం జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులుగా, వట్టిపెల్లి అజర్ గౌడ్ లను మండలం యువజన విభాగం అధ్యక్షులుగా అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కూరెళ్ల వేములయ్య గౌడ్ హైదరాబాద్ లో సోమవారం నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భముగా పహిల్వాన్ పూర్ గ్రామానికి చెందిన యువకులు నియామకం కావటం పట్ల మండల గౌడ సంఘం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో మల్లం భాను చందర్ తదితరులు పాల్గొన్నారు.